జగన్ వారిద్దరికీ ?

శాసనమండలిని రద్దు చేస్తూ కేబినెట్ సమావేశం తీర్మానం చేసింది. అయితే ఏపీ మంత్రివర్గ సమావేశంలో జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్సీలుగా ఎన్నికై మంత్రులుగా పిల్లి [more]

Update: 2020-01-27 05:22 GMT

శాసనమండలిని రద్దు చేస్తూ కేబినెట్ సమావేశం తీర్మానం చేసింది. అయితే ఏపీ మంత్రివర్గ సమావేశంలో జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్సీలుగా ఎన్నికై మంత్రులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు ఉన్నారు. వీరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. శాసనమండలి రద్దుతో వీరిద్దరూ మంత్రులుగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో శాసనమండలి రద్దు విషయంలో సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో వీరిద్దరూ ఉన్నారు. అయితే జగన్ వీరిద్దరికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వ పరంగా తాను అండగా ఉంటానని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలిసింది.

Tags:    

Similar News