వచ్చే వారం తేలనుందా?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీబీఐ కోర్టుకు హాజరవ్వాలా? వద్దా? అనే విషయంపై వచ్చే వారం సీబీఐ కోర్టు తీర్పు చెప్పనుంది. నేడు శుక్రవారం కావడంతో జగన్ [more]

Update: 2020-01-17 05:46 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీబీఐ కోర్టుకు హాజరవ్వాలా? వద్దా? అనే విషయంపై వచ్చే వారం సీబీఐ కోర్టు తీర్పు చెప్పనుంది. నేడు శుక్రవారం కావడంతో జగన్ మినహా మిగిలిన వారు కోర్టుకు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి ఈరోజు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతోపాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావులు సయితం హాజరయ్యారు. అయితే తాను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ ఇప్పటికే న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై వచ్చే శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు చెప్పనుంది.

Tags:    

Similar News