జగన్ చేతికి బీసీజీ నివేదిక

బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు ప్రతినిధులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కొద్దిసేపటి క్రితం కలిశారు. వారు రాజధాని అంశంపై నివేదికను జగన్ కు ఇచ్చారు. వైట్ పేపర్ [more]

Update: 2020-01-03 11:14 GMT

బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు ప్రతినిధులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కొద్దిసేపటి క్రితం కలిశారు. వారు రాజధాని అంశంపై నివేదికను జగన్ కు ఇచ్చారు. వైట్ పేపర్ ఇన్ సీఆర్డీఏ పేరుతో జగన్ కు నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో రాజధాని ఏర్పాటుతో పాటు రాజకీయ అంశాలను కూడా బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన హైపవర్ కమిటీ జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూపు కమిటీ నివేదికలపై చర్చించనుంది. ఈ నెల 8వతేదీన జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ రెండు నివేదికలపై చర్చిస్తారు. ఈ నెల 20వ తేదీలోగా హైపవర్ కమిటీ నివేదిక ఇస్తుంది. ఈ తర్వాత అసెంబ్లీలో చర్చించి మూడు రాజధానుల అంశంపై ఒక నిర్ణయం ప్రకటించే అవకాశముంది.

Tags:    

Similar News