2022 నాటికి పోలవరం ద్వారా నీరందిస్తాం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆయన అధికారులతో పనుల పురోగతిపై చర్చించారు. స్పిల్ వే ను కూడా పరిశీలించిన ముఖ్యమంత్రి జగన్ 2022 [more]

Update: 2020-12-14 07:40 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆయన అధికారులతో పనుల పురోగతిపై చర్చించారు. స్పిల్ వే ను కూడా పరిశీలించిన ముఖ్యమంత్రి జగన్ 2022 నాటికి ఖరీఫ్ సీజన్ కు పోలవరం ద్వారా నీటిని అందిస్తామని తెలిపారు. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయని జగన్ తెలిపారు. నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని ఈ సందర్బంగా జగన్ వెల్లడించారు. జగన్ వెంట ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. కాఫర్ డ్యాం పనులను కూడా జగన్ పరిశీలించారు.

Tags:    

Similar News