మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం..!

భారత వైమానిక దళాన్ని చూసి గర్వపడుతున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇవాళ తెల్లవారు జామున భారత [more]

Update: 2019-02-26 09:43 GMT

భారత వైమానిక దళాన్ని చూసి గర్వపడుతున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇవాళ తెల్లవారు జామున భారత వైమానిక దళాలు పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసి సంగతి తెలిసిందే. భారత బలగాలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు వీరోచిత దాడులు చేసిన భారత వైమానిక దళానికి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్ 2ని విజయవంతం చేసిన భారత వైమానిక దళాన్ని చూసి గర్వపడుతున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

http://

https://platform.twitter.com/widgets.js

Tags:    

Similar News