రాజన్న బిడ్డ..మాట తప్పడు…!!

కర్నూలు జిల్లా బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చల్లా రామకృష్ణారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఆయన లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో [more]

Update: 2019-03-08 11:05 GMT

కర్నూలు జిల్లా బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చల్లా రామకృష్ణారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఆయన లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాయలసీమలో కరువు తాండవిస్తుందని, ఉత్తరాంధ్రలో తుఫాన్లు వచ్చి రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఒక రైతుగా రాష్ట్రంలో రైతులు బాగుపడాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జగన్

బేషరతుగా వచ్చా….

నవరత్నాల్లో భాగంగా చెప్పిన పథకాలను ఎన్నికల ముందు ప్రజలను ఏమార్చడానికి చంద్రబాబు అమలు చేస్తున్నారని అన్నారు. పదవులు అనుభవించి పార్టీ మారుతున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాను ఇప్పటికి 8 నెలల పదవీకాలమే ముగిసిందని, ఇంకా 16 నెలల పదవీకాలం వదులుకొని వైసీపీలో చేరానన్నారు. మాయమాటలు చెప్పి పని చేయించుకుని కరివేపాకులా తీసి వేసే కుటుంబం వైఎస్ ది కాదని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో నంద్యాల పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News