చంద్రబాబు కుట్ర అదేనన్న వైసీపీ

అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం ఇస్తామని చెబుతూ చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని వైసీపీ నేత కన్నబాబు ఆరోపించారు. తాంబూలాలు ఇచ్చాను తన్నుకు [more]

Update: 2019-01-23 13:09 GMT

అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం ఇస్తామని చెబుతూ చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని వైసీపీ నేత కన్నబాబు ఆరోపించారు. తాంబూలాలు ఇచ్చాను తన్నుకు చావండి అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, కాపులకు మిగతా అగ్రవర్ణ పేదలకు మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లపై ఇచ్చిన హామీ నెరవేర్చాలని అడిగితే అసాంఘిక శక్తులుగా కాపులపై ముద్రవేసిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. అగ్రవర్ణ పేదల కోటాలో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని నిపుణులు చెబుతున్నా ఎన్నికల కోసమే చంద్రబాబు ఈ నిర్ణయం ప్రకటించారన్నారు. అగ్రవర్ణ పేదలంతా కాపులకు వ్యతిరేకం అవ్వాలనే చంద్రబాబు ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం తగదన్నారు. రిజర్వేషన్ల పేరుతో కాపులను ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారని ప్రశ్నించారు.

Tags:    

Similar News