చంద్రబాబు సూచన చేస్తే కేసులా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుపై కేసులు పెట్టడాన్ని ఆయన ఖండించారు. ఎన్ 440 [more]

Update: 2021-05-10 00:31 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుపై కేసులు పెట్టడాన్ని ఆయన ఖండించారు. ఎన్ 440 కె వేరియంట్ పై ప్రభుత్వాన్ని, ప్రజలను అప్రమత్తం చేస్తే చంద్రబాబుపై కేసులు పెడతారా? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం కరోనా కట్టడి కంటే ప్రత్యర్థి పార్టీపై కక్ష సాధింపు చర్యలపైనే ఫోకస్ పెట్టిందని యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. ఇప్పటికైనా జగన్ కక్ష సాధింపు చర్యలు మానుకుని కరోనా నియంత్రణకు పని చేయాలని ఆయన కోరారు.

Tags:    

Similar News