జగన్ ఇది గుర్తుంచుకో?

కొత్త పథకాలను ప్రారంభించాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఉగాది నాడు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ [more]

Update: 2020-03-19 07:05 GMT

కొత్త పథకాలను ప్రారంభించాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఉగాది నాడు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కొత్త పథకమేనని, దీనిని ప్రారంభించడానికి ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. తొలుత కరోనా వైరస్ ప్రభావం ఏమీ లేదని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు హడావిడిగా అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా వచ్చి కరోనా పై ఎలాంటి చర్యలు తీసుకున్నామన్నది చెప్పాలన్నారు యనమల. కరోనా వైరస్ పై ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News