విశాఖ ఎయిర్ పోర్టుకు జగన్ చేరుకోగానే...?

Update: 2018-11-11 13:03 GMT

విశాఖ ఎయిర్ పోర్ట్ లో గాయపడిన వైసీపీ అధినేత జగన్ కొద్దిసేపటి క్రితం విశాఖకు చేరుకున్నారు. దాదాపు 18 రోజుల విశ్రాంతి అనంతరం రేపటి నుంచి పాదయాత్రలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని శిబిరంలోకి చేరుకుంటారు. జగన్ విశాఖకు చేరుకున్న వెంటనే పెద్దయెత్తున ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికేందుకు చేరుకున్నారు.

దాడి జరిగిన తర్వాత.....

గత నెల 25వ తేదీన అదే విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడికి దిగిన సంగతి తెలిసిందే. గాయపడిన వెంటనే ఎయిర్ పోర్టులోనే ప్రాధమిక చికిత్స చేయించుకున్న జగన్ విమానంలో అదేరోజు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మూడురోజుల పాటు చికిత్స పొందారు. ఈ 18 రోజులు ఈ ఘటనపై విమర్శలు, ప్రతి విమర్శలు అధికార, విపక్షాల నుంచి వచ్చాయి. ఈ ఘటనపై ఇప్పటి వరకూ జగన్ పెదవి విప్పలేదు. తిరిగి రేపటి నుంచి ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభం కానుంది.

Similar News