జగన్ తిరిగి రాగానే ఆ గ్రామస్థులు....?

Update: 2018-10-29 11:19 GMT

జగన్ పై హత్యాయత్నం జరగడంతో సాలూరు నియోజకవర్గంలోని మక్కువ గ్రామం ప్రజలు షాక్ కు గురయ్యారు. ఈనెల 25వ తేదీన కూడా జగన్ ను దగ్గరుండి మక్కువ గ్రామ ప్రజలు చూశారు. ఆయన శిబిరం వద్దకు వెళ్లి పలుకరించి వచ్చారు. ఉదయం ఆయన విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర తిరిగి విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ గ్రామం నుంచి ప్రారంభం కానుంది. అయితే ఇక్కడ మక్కువ గ్రామ ప్రజలు ప్రత్యేకంగా జగన్ కు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో శిబిరం వద్దకు వచ్చి జగన్ కు దిష్టి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో అన్ని మతాల వారితో ప్రార్థనలు చేయించనున్నారు. జగన్ తిరిగి పాదయాత్రలో పాల్గొనడం తమకు ఎనలేని సంతోషాన్నిస్తుందని పలువురు గ్రామస్థులు చెబుతున్నారు. జగన్ శిబిరం వద్దకు వచ్చి చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు చూసి వెళుతున్నారు.

Similar News