నారా లోకేష్ జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీపైన, చంద్రబాబుపైన జగన్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లలో పెదబాబు, చినబాబు 34వేల కోట్లు దోచుకున్నారని జగన్ విమర్శించారు. అయితే జగన్ విమర్శలకు కౌంటర్ గా నారా లోకేష్ ట్విట్టర్లో సమాధానమిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గుర్తించలేని ప్రతిపక్ష నేత ఏ1 ముద్దాయిగా గుర్తుంచుకోవాలన్నారు. జగన్ చేసే విమర్శలు అర్థరహితమన్నారు. రాష్ట్రంలో ఉన్న సహజవనరులన్నింటినీ జగన్ ఎప్పుడో దోచుకున్నారని, ఇక ఏవీ లేవని లోకేష్ ఎద్దేవా చేశారు.