తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ అధికార ప్రతినిధి నిమ్మగడ్డ సీతారత్న కుమారి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు లేఖరాశారు. చంద్రబాబు చుట్టూ భజనపరులు చేరారని ఆమె లేఖలో పేర్కొన్నారు. ప్రస్థుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ధృడ సంకల్పం ఉన్న నాయకుడి అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. కేవలం రాజకీయాలే చేస్తే ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు.