ఐదులక్షలేంది? ఎన్ని లక్షల మెజారిటీ అయినా వస్తుంది

ఇలా ఎన్నిక జరిగితే వైసీపీకి ఐదు లక్షలే కాదు ఎన్ని లక్షల ఓట్ల మెజారిటీ అయినా వస్తుందని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. తిరుపతి ఉప [more]

Update: 2021-04-18 00:54 GMT

ఇలా ఎన్నిక జరిగితే వైసీపీకి ఐదు లక్షలే కాదు ఎన్ని లక్షల ఓట్ల మెజారిటీ అయినా వస్తుందని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లను విపరీతంగా పోల్ చేయించారన్నారు. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి వ్యక్తులను తీసుకువచ్చి ఓట్లను వేయించారన్నారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా తిరుపతి ఉప ఎన్నిక జరిగిందన్నారు. పోలింగ్ శాతం పెంచుకునేందుకు దొంగ ఓట్లను అధికంగా పోల్ చేయించారని విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Tags:    

Similar News