టీడీపీ నుంచి ఇంకా వలసలున్నాయ్

పార్టీని వీడి వెళ్లిన వారు రాజీనామా చేయాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. రాజీనామా చేయకుండా పార్టీ మారడమేంటని ప్రశ్నించారు. వాసుపల్లి గణేష్ కుమార్ [more]

Update: 2020-09-24 06:44 GMT

పార్టీని వీడి వెళ్లిన వారు రాజీనామా చేయాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. రాజీనామా చేయకుండా పార్టీ మారడమేంటని ప్రశ్నించారు. వాసుపల్లి గణేష్ కుమార్ రాజీనామా చేయకుండా పార్టీకి మద్దతు పలకడమేంటని ఆయన నిలదీశారు. మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడతారని విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. గంటా శ్రీనివాస్ పార్టీ మారతారా? లేదా? చెప్పాల్సి ఉందన్నారు. విశాఖలో పార్టీ మారే నేతలు ఎక్కువయ్యారని ఆయన అన్నారు.

Tags:    

Similar News