సిగ్గనిపించడంలేదా….?

పాడి ఆవులాంటి ప్రభుత్వ ఖజానాను పిండేసిన చంద్రబాబు నాయుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు [more]

Update: 2019-08-08 06:44 GMT

పాడి ఆవులాంటి ప్రభుత్వ ఖజానాను పిండేసిన చంద్రబాబు నాయుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు నెలలవుతున్నా చంద్రబాబునాయుడుకు ఓటమికి కారణాలు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలను దోచుకున్న చంద్రబాబు తనకు తాను గంగిగోవుగా అభివర్ణించుకోవడంపై విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపారన్నారు.

Tags:    

Similar News