కన్నా సైలెంట్ అయింది ఆయన హర్ట్ అవుతారనేనా?

వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డి ట్టిట్టర్ లో చంద్రబాబును, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్న చంద్రబాబు నిరసనదీక్షలకు దిగడమేంటని [more]

Update: 2020-07-09 05:59 GMT

వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డి ట్టిట్టర్ లో చంద్రబాబును, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్న చంద్రబాబు నిరసనదీక్షలకు దిగడమేంటని ఎద్దేవా చేశారు. దొంగే దొంగా అని అరచినట్లవుతుందని అన్నారు. తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేయడమేంటని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో నిర్మాణం పూర్తికాని ఇళ్లపై బీజేపీ నేత సోము వీర్రాజు కడిగిపారేశారని, కానీ కన్నా లక్ష్మీనారాయణ మాత్రం చంద్రబాబు ఎక్కడ హర్ట్ అవుతారోనని సైలెంట్ అయ్యారని వ్యంగంగా ట్వీట్ చేశారు.

Tags:    

Similar News