హైదరాబాద్ లో బాబు గలీజు పనులు

హయత్ హోటల్ భేటీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ లో కూర్చుని చంద్రబాబు చేస్తున్న గలీజు పనులు ఇవే అంటూ ఆయన ట్వీట్ [more]

Update: 2020-06-24 06:26 GMT

హయత్ హోటల్ భేటీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ లో కూర్చుని చంద్రబాబు చేస్తున్న గలీజు పనులు ఇవే అంటూ ఆయన ట్వీట్ చేశారు. మ్యానిపులేషన్లు, వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలోనే చంద్రబాబు మునిగి తేలుతుంటారని విజయసాయిరెడ్డి అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని దళారీ పార్టీగా మార్చారని విజయసాయరెడ్డి ఎద్దేవా చేశారు. అధికారానికి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు రాలేడని ఆయన అన్నారు. అలాగే హయత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిలు ఏ వ్యాపారం చేయడానికి భేటీ అయి ఉంటారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News