దేవుడికి థ్యాంక్స్ చెప్పిన ఉపాసన

Update: 2018-04-13 07:44 GMT

రామ్ చరణ్ .. సుకుమార్ తో కలిసి రంగస్థలాన్ని పూర్తి చేయ్యడానికి ఒక్క ఏడాది సమయం పట్టింది. ఏడాది పడితేనేం.... ఎప్పటికి గుర్తుండిపోయే హిట్ అందుకుని హ్యాపీ గా వున్నాడు. అయితే 'రంగస్థలం' షూటింగ్ సమయంలో రామ్ చరణ్ విషయాలన్నిటినీ ఆయన భార్య ఉపాసన ఎప్పటికప్పుడు అభినానులకు తెలిసేలా సోషల్ మీడియాలో షేర్ చేసేది. కేవలం 'రంగస్థలం' సినిమా అప్పుడే కాదు... చెర్రీ విషయాలను ఎప్పటికప్పుడు ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక రామ్ చరణ్ ఎంతో కష్టపడి నటించిన రంగస్థలం హిట్ కావడంతో ఈ మెగా దంపతులు మంచి మూడ్ లోకెళ్ళిపోయారు. రంగస్థలాన్ని అంత పెద్ద హిట్ చేసినందుకు ఉపాసన అభిమానులకు థాంక్స్ చెప్పడమే కాదు... దేవుడికి థాంక్స్ చెప్పేసింది.

శ్రీవారిని దర్శించుకుని.....

తన చిన్నమమ గారు పవన్ కళ్యాణ్ దంపతులతో కలిసి 'రంగస్థలం' సినిమా చూసిన ఉపాసన పనిలో పనిగా దేవుడిని కూడా దర్శించేసుకుంది. రంగస్థలం హిట్ అందించిన తిరుపతి వెంకన్న కు ముడుపులు చెల్లించుకుంది. అదికూడా కాలినడకన వెళ్లి ఉపాసన ఏడుకొండల వాడి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంది ఉపాసన. గురువారం సాయంత్రం కాలి నడకను ప్రారంభించిన ఉపాసన.... కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత శుక్రవారం ఉదయం ఆమె వీఐపీ బ్రేక్ సమయంలో ఏడుకొండల వెంకన్న దర్శనం చేసుకుంది. రెండు వారాల క్రితం విడుదలైన 'రంగస్థలం' బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. 'రంగస్థలం' హిట్ తో రామ్ చరణ్ చాలా సంతోషంగా ఉన్నాడు. అందుకే ఆయన భార్య తన భర్త కు అంత పెద్ద విజయం అందించిన దేవుడికి భక్తితో కృతఙ్ఞతలు తెలిపింది.

Similar News