జగన్ మంచి బిజినెస్ మెన్.. నవరత్నాలే…?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి బిజినెస్ మ్యాన్ అని, రాజకీయాల్లోనూ పరిణితి చెందారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. నవరత్నాల వల్ల ప్రజలు [more]

Update: 2021-03-08 00:57 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి బిజినెస్ మ్యాన్ అని, రాజకీయాల్లోనూ పరిణితి చెందారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. నవరత్నాల వల్ల ప్రజలు జగన్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. అయితే ఇది తాత్కాలికమేనని, ప్రజలు అభివృద్ధి వైపే మొగ్గు చూపుతారని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతి ఎక్కడికీ వెళుతుందని తాను అనుకోవడం లేదన్నారు. అలాగే రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, చంద్రబాబు పనిఅయిపోయిందనుకోవడం సరికాదని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగుతుందని భావించలేమన్నారు. అందరూ కలసికట్టుగా పోరాడితేనే విభజన హామీలు సాధించుకోవచ్చని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News