జగన్ స్పష్టమైన ప్రకటన చేయాల్సిందే.. ఉండవల్లి డిమాండ్

పోలవరం నిధులపై స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోలవరం లో కడుతున్నది ఆనకట్ట మాత్రమేనని, ప్రాజెక్టు కాదని [more]

Update: 2020-12-22 08:24 GMT

పోలవరం నిధులపై స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోలవరం లో కడుతున్నది ఆనకట్ట మాత్రమేనని, ప్రాజెక్టు కాదని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలే ఇస్తానంటుందని, మరి 22 వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు ముంపు బాధితుల పరిహారాన్ని ఎవరు చెల్లిస్తారని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ నిధులను భరిస్తుందా? లేదా కేంద్రం నుంచి వసూలు చేస్తుందా? అన్నది తెలపాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు.

Tags:    

Similar News