సీబీఐ కేసులకే భయపడుతున్నారా?

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అన్యాయం చేస్తుంటే ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీని ప్రశ్నించారు. టీడీపీ ఆరోపిస్తున్నట్లు సీబీఐ కేసులకు భయపడుతున్నారా? అని [more]

Update: 2020-11-29 02:23 GMT

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అన్యాయం చేస్తుంటే ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీని ప్రశ్నించారు. టీడీపీ ఆరోపిస్తున్నట్లు సీబీఐ కేసులకు భయపడుతున్నారా? అని ఉండవల్లి నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుకు 20 వేల కోట్లకు మించి ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టంగా లేఖ వచ్చినా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు ఎవరినీ వెళ్లనివ్వకుండా అడ్డుకుంది ఎందుకో చెప్పాలన్నారు. ఇప్పటికైనా జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని పోలవరం విషయంలో నిలదీయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News