బ్రేకింగ్ : వారం పాటు భక్తులకు ప్రవేశం లేదు

తిరుమలలో భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈవో సింఘాల్ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. స్వామి వారికి ఏకాంత సేవలు [more]

Update: 2020-03-19 12:25 GMT

తిరుమలలో భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈవో సింఘాల్ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. స్వామి వారికి ఏకాంత సేవలు నిర్వహిస్తామని చెప్పారు. తిరుమల ఆలయాన్ని మూసివేయడం లేదని చెప్పారు. టీటీడీ నిర్ణయాలకు భక్తులు సహకరించాలని కోరారు. కరోనా వైరస్ ప్రభావంతో తాత్కాలికంగా మాత్రమే భక్తులను ఆలయంలోకి ప్రవేశంపై నిషేధం విధించామని చెపపారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తులకు స్వామి వారి దర్శనం లభిస్తుందని చెప్పారు. ప్రస్తుతం వారం రోజుల పాటు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో చెప్పారు. ఒంటిమిట్ట సీతారామ కల్యాణం కూడా ఏకాంతంగానే నిర్వహిస్తామని తెలిపారు.

Tags:    

Similar News