నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో?

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు ప్రగతి భవన్ లో జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు [more]

Update: 2021-07-16 04:58 GMT

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు ప్రగతి భవన్ లో జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు కృష్ణా, గోదావరి జలాలపై విడుదల చేసిన నోటిఫికేషన్ పై చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ఏకపక్షంగా ఉందని టీఆర్ఎస్ భావిస్తుంది. దీనిపై పార్లమెంటు సమావేశాల్లో అభ్యంతరం తెలపాలని భావిస్తుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాన్ని కేసీఆర్ లోక్ సభ సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన అంశాలపై చర్చించనున్నారు.

Tags:    

Similar News