తొలి రౌండ్ లో వాణీదేవికే ఆధిక్యత

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో తొలి రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ లో వాణిదేవికి 17,439 [more]

Update: 2021-03-18 01:59 GMT

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో తొలి రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ లో వాణిదేవికి 17,439 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 16,385 ఓ‌ట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ గా పోటీచేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ కు 8,357 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 5,082 ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గంలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో కౌంటింగ్ ఆలస్యమవుతోంది.

Tags:    

Similar News