లోటస్ పాండ్ ను ముట్టడించిన భజరంగ్ దళ్

తిరుమల డిక్లరేషన్ వివాదం హైదరాబాద్ కు పాకింది. హైదరాబాద్ లోని వైఎస్ జగన్ నివాసం లోటస్ పాండ్ ను భజరంగ్ దళ్ కార్యకర్తలు ముట్టడించారు. తిరుమలలో మత [more]

Update: 2020-09-23 07:06 GMT

తిరుమల డిక్లరేషన్ వివాదం హైదరాబాద్ కు పాకింది. హైదరాబాద్ లోని వైఎస్ జగన్ నివాసం లోటస్ పాండ్ ను భజరంగ్ దళ్ కార్యకర్తలు ముట్టడించారు. తిరుమలలో మత సంప్రాదాయాలను పాటించాలని కోరుతూ భజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు లోటస్ పాండ్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో తెలంగాణ పోలీసులు భజరంగదళ్ కార్కకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా భజరంగ్ దళ్ ఈ నిరసనలకు దిగింది. దీంతో జగన్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News