కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆందోళన.. ఏం చేయాలని?

కేంద్రమంత్రి మండలి సమావేశమయ్యింది. కరోనా వైరస్ కేసులు భారత్ లో తగ్గకపోవడం, రోజురోజుకూ పెరుగుతుండటంపై కేంద్ర మంత్రి మండలి చర్చించనుంది. ఈ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 5,611 [more]

Update: 2020-05-20 06:02 GMT

కేంద్రమంత్రి మండలి సమావేశమయ్యింది. కరోనా వైరస్ కేసులు భారత్ లో తగ్గకపోవడం, రోజురోజుకూ పెరుగుతుండటంపై కేంద్ర మంత్రి మండలి చర్చించనుంది. ఈ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 5,611 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 140మంది ఒక్కరోజులోనే చనిపోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,750కి చేరింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 3,303 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాటు లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత జరుగుతున్న పరిణామాలపై కేంద్ర మంత్రి మండలి చర్చించనుంది. మే 31వ తేదీ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై కూడా మంత్రిమండలి చర్చించనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News