తాడిపత్రిలో మళ్లీ టెన్షన్

తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు మున్సిపాలిటీకీ రెండో వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనుండటంతో ఇరు వర్గాలు మొహరించాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీకి 18 [more]

Update: 2021-07-30 03:39 GMT

తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు మున్సిపాలిటీకీ రెండో వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనుండటంతో ఇరు వర్గాలు మొహరించాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీకి 18 డివిజన్లు, వైసీపీకి 16 డివిజన్లు దక్కాయి. ఇండిపెండెంట్, సీపీఐ అభ్యర్థుల మద్దతుతో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈరోజు రెండో వైస్ ఛైర్మన్ జరుగుతుండటంతో ఇరు పార్టీలు తమ అభ్యర్థులను క్యాంప్ లకు తరలించాయి. మరికాసేపట్లో ఎన్నిక జరగనుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. 144వ సెక్షన్ విధించారు.

Tags:    

Similar News