మహానాడు నేడు.. కొద్దిమందికే అవకాశం

ఈరోజు నుంచి తెలుగుదేశం పార్టీ మహానాడు జరగనుంది. రెండు రోజుల పాటు మహానాడు జరపనున్నారు. నేడు చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ [more]

Update: 2020-05-27 02:41 GMT

ఈరోజు నుంచి తెలుగుదేశం పార్టీ మహానాడు జరగనుంది. రెండు రోజుల పాటు మహానాడు జరపనున్నారు. నేడు చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది రెండు రోజుల పాటు మాత్రమే మహానాడు జరపాలని నిర్ణయించారు. ఏటా మూడు రోజుల పాటు సమావేశాలు జరిగేవి. ఈసారి రెండు రోజులు మాత్రమే జరుగుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా మహానాడును ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు. చంద్రబాబు మంగళగిరి పార్టీ కార్యాలయంలో కొద్ది మంది నేతలతో మాత్రమే మహానాడులో పాల్గొంటారు. మిగిలిన నేతలు ఎవరి ఇళ్లలో వారే ఉండి మహానాడులో పాల్గొననున్నారు. మొత్తం 14 వేల మంది ఆన్ లైన్ లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. టీడీపీ వెబ్ సైట్ ద్వారా మహానాడును ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

Tags:    

Similar News