బాబు నిర్ణయంతో … సీమ నేత టీడీపీకి రాజీనామా

తెలుగుదేశం పార్టీ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ టీడీపీ నేత రాజీనామా చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జి విక్టర్ టీడీపీకి రాజీనామా [more]

Update: 2020-02-01 11:14 GMT

తెలుగుదేశం పార్టీ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ టీడీపీ నేత రాజీనామా చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జి విక్టర్ టీడీపీకి రాజీనామా చేశారు. కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటిస్తే దానిని టీడీపీ వ్యతిరేకించడమేంటని ప్రశ్నించారు. పాలన వికేంద్రీకరణ బిల్లును మండలిలో అడ్డుకోవడం అంటే రాయలసీమకు అన్యాయం చేయడమేనని విక్టర్ తెలిపారు. కర్నూలు హైకోర్టుకు వస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకున్నారని, అందుకే తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News