టీడీపీకి మరో షాక్.. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జంప్?

తెలుగుదేశం పార్టీకి వరస దెబ్బలు తగులుతున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అవకాశమిచ్చిన వారు కూడా పార్టీలో ఉండటానికి ఇష్టపడటం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇతర [more]

Update: 2020-03-13 02:49 GMT

తెలుగుదేశం పార్టీకి వరస దెబ్బలు తగులుతున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అవకాశమిచ్చిన వారు కూడా పార్టీలో ఉండటానికి ఇష్టపడటం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వలసలు పెద్దయెత్తున ప్రారంభమయ్యాయి. అనంతపురం జిల్లాలోనూ టీడీపీకి ఎదురుదెబ్బ తగలనుంది. మాజీ ఎమ్మెల్యే యామినిబాల, ఆమె తల్లి ఎమ్మెల్సీ శమంతకమణి టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. వారు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి గతంలో ఇద్దరూ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు యామినబాలకు టిక్కెట్ ఇవ్వలేదు. ఈ నియోజకవర్గంలో జేసీ జోక్యం ఎక్కువగా ఉండటంతో పార్టీని వీడేందుకు ఇద్దరూ సిద్ధమయిపోయినట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు.

Tags:    

Similar News