జగన్ లాలూచీకి నిదర్శనం

మచిలీపట్నం పోర్టును జగన్ ప్రభుత్వం తెలంగాణకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. గత నెల 28వ తేదీన ఈ మేరకు జగన్ [more]

Update: 2019-07-29 08:08 GMT

మచిలీపట్నం పోర్టును జగన్ ప్రభుత్వం తెలంగాణకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. గత నెల 28వ తేదీన ఈ మేరకు జగన్ సర్కార్ రహస్య జీవో విడుదల చేసిందని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి బందరు పోర్టును అప్పగిస్తున్నారా? అని అసెంబ్లీ లో అడిగితే లేదని సమాధానం చెప్పారన్నారు. కానీ కేసీఆర్, జగన్ భేటీలో జరిగిన ఒప్పందం ప్రకారం ఈమేరకు బందరు పోర్టును తెలంగాణకు అప్పగించే లోపాయికారీ ప్రయత్నం జరుగుతుందని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడితే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. కేసీఆర్ తో జగన్ లాలూచీకి ఇది నిదర్శనమన్నారు.

Tags:    

Similar News