ఏపీ విషయంలో జాగ్రత్తగా ఉండండి

నీటి వివాదాలను అనవసరంత ఏపీ సృష్టిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అనవసర వివాదాలను రాజేస్తుందన్నారు. నీటి వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సమర్థవంతంగా వాదనను విన్పించాలని [more]

Update: 2020-09-30 08:17 GMT

నీటి వివాదాలను అనవసరంత ఏపీ సృష్టిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అనవసర వివాదాలను రాజేస్తుందన్నారు. నీటి వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సమర్థవంతంగా వాదనను విన్పించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. మరోసారి తెలంగాణ విషయంలో ఏపీ జోక్యం చేసుకోకుండా వాదనలు ఉండాలని కేసీఆర్ అన్నారు. నీటి వివాదాల విషయాన్ని గతంలోనే ప్రధానికి లేఖ రాసినా స్పందన లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నదీ జలాల విషయంలో తలొగ్గే ప్రసక్తి లేదని కేసీఆర్ అన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా ఎండగట్టాలన్నారు.

Tags:    

Similar News