మూడు రాష్ట్రాల్లో పోటీకి దిగుతాం

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మూడింటిలో పోటీకి రాష్ట్రీయ జనతాదళ్ సిద్ధమయింది. అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆ [more]

Update: 2021-02-28 01:03 GMT

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మూడింటిలో పోటీకి రాష్ట్రీయ జనతాదళ్ సిద్ధమయింది. అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత తేజస్వి యాదవ్ తెలిపారు. ఈ ఎన్నికల్లో స్థానికంగా ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని తేజస్వి యాదవ్ చెప్పారు. హిందీ ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించుతామని తేజస్వి యాదవ్ ప్రకటించారు. ఇప్పటికే ఈ మూడు రాష్ట్రాల్లో పరిస్థితులను అధ్యయనం చేయడానికి పరిశీలకులను పంపినట్లు తేజస్వి యాదవ్ తెలిపారు.

Tags:    

Similar News