ఎన్నికల కమిషన్ ను కలవనున్న టీడీపీ నేతలు..తిరుపతి ఎన్నికను?

కేంద్ర ఎన్నికల కమిషన్ ను టీడీపీ నేతలు కలవనున్నారు. నిన్న చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిపై ఫిర్యాదు చేయనున్నారు. తిరుపతి ఉప ఎన్నికను కేంద్ర బలగాల భద్రత [more]

Update: 2021-04-13 04:16 GMT

కేంద్ర ఎన్నికల కమిషన్ ను టీడీపీ నేతలు కలవనున్నారు. నిన్న చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిపై ఫిర్యాదు చేయనున్నారు. తిరుపతి ఉప ఎన్నికను కేంద్ర బలగాల భద్రత మధ్య జరిపించాలని టీడీపీ నేతలు కోరనున్నారు. నిన్న రాత్రి తిరుపతిలో చంద్రబాబు రోడ్ షో రాయి విసిరిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేశారు. రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకంలేదని, కేంద్ర బలగాల సహకారంతో ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్ ను టీడీపీ నేతలు కోరనున్నారు.

Tags:    

Similar News