ముట్టడి..కట్టడి అంటే కుదరదు…స్పీకర్ హెచ్చరిక

అసెంబ్లీ సమావేశాలను పకడ్బందీగా నిర్వహిస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. అసెంబ్లీ ముట్టడి, కట్టడి అంటే కుదరదని సీతారాం హెచ్చరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టసభలలోకి [more]

Update: 2020-01-19 11:35 GMT

అసెంబ్లీ సమావేశాలను పకడ్బందీగా నిర్వహిస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. అసెంబ్లీ ముట్టడి, కట్టడి అంటే కుదరదని సీతారాం హెచ్చరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టసభలలోకి ఆగంతకులు ప్రవేశించకూడదనే నియమ నిబంధనలున్నాయన్నారు. శాసనసభ పైనే దాడి చేస్తామనడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన తెలిపారు. చట్టాలకు లోబడే నిరసనలు వ్యక్తం చేయాలన్నారు. చట్ట సభలను అడ్డుకోవడం సభా హక్కుల ఉల్లంఘనేనని తమ్మినేని సీతారాం చెప్పారు.

Tags:    

Similar News