ఏపీ సర్కార్ కు సుప్రీంకోర్టులో….?

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎంతవరకూ కొనసాగిస్తారని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తన సస్పెన్షన్ పై ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు [more]

Update: 2021-03-10 01:19 GMT

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎంతవరకూ కొనసాగిస్తారని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తన సస్పెన్షన్ పై ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయన సస్పెన్షన్ ను ఎత్తివేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పోస్టింగ్ ఇవ్వకుండా ఎంతవరకూ సస్పెన్షన్ కొనసాగిస్తారని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
అయితే ఇందుకు ప్రభుత్వం ఆరు నెలల సమయం కోరింది. అయితే రోజువారీ విచారణ చేపట్టి వచ్చే నెల 30 వతేదీలోగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags:    

Similar News