వివేకా హత్యకేసులో సంచలన విషయం చెప్పిన సునీత

మా నాన్నను మా అన్న జగనే చంపాడు అని ప్రతీ రోజూ చంద్రబాబు నాయుడు తప్పుడు ఆరోపణలు చేస్తుంటే ఆయన కింద పనిచేసే పోలీసులు ఇక వేరే [more]

Update: 2019-03-22 08:59 GMT

మా నాన్నను మా అన్న జగనే చంపాడు అని ప్రతీ రోజూ చంద్రబాబు నాయుడు తప్పుడు ఆరోపణలు చేస్తుంటే ఆయన కింద పనిచేసే పోలీసులు ఇక వేరే ఏం చెబుతారని, అసలైన దోషులను ఎలా బయటకు వస్తారని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డా.సునీతారెడ్డి ప్రశ్నించారు. శక్రవారం ఆమె కేంద్ర ఎన్నికల సంఘం అధికారి సునీల్ అరోరాను కలిసి ఈ కేసులో నిష్పక్షపాత విచారణ జరిగేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి స్వయంగా కేసును తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారని, ఈ కేసును పూర్తిగా తప్పుదారి పట్టించి మా వాళ్లనే దోషులుగా చూపిస్తారేమో అని భయమేస్తుందని ఆమె వాపోయారు. సిట్ విచారణ సరిగ్గా జరగడం లేదన్నారు. చంద్రబాబుకు రిపోర్ట్ చేసే సంస్థ కాకుండా ఇతర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం సూచన మేరకు హోంశాఖ కార్యదర్శిని కలువనున్నట్లు తెలిపారు. ఈ అంశంపై తన తల్లి హైకోర్టులో పిటీషన్ వేయనునట్లు తెలిపారు.

Tags:    

Similar News