అహ్మద్ పటేల్ కు డబ్బులు పంపలేదా?

చంద్రబాబు, నారా లోకేష్ లు అత్యంత అవినీతిపరులని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అహ్మద్ పటేల్ కు 400 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ను [more]

Update: 2020-02-20 11:37 GMT

చంద్రబాబు, నారా లోకేష్ లు అత్యంత అవినీతిపరులని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అహ్మద్ పటేల్ కు 400 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ను హవాలా రూపంలో పంపిన అంశం తెరిపైకి రాగానే హడావిడిగా ఆస్తులను లోకేష్ ప్రకటించారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని అన్నారు. పీఏ శ్రీనివాస్ ఇంట్లో దొరికిన డైరీలో అహ్మద్ పటేల్ కు 400 కోట్లు పార్టీ ఫండ్ పంపినట్లు తేలిందన్నారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఆస్తులను ప్రకటించారన్నారు. బినామీ ఆస్తులన్నీ ప్రకటిస్తే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు చంద్రబాబు అవుతారని ఆయన అన్నారు. చంద్రబాబు చేసిన బినామీల ఆత్మరక్షణ యాత్ర అని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News