కలవరమే..మరణాలు కూడా పెరుగుతున్నాయ్

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. ప్రధానంగా హైదరాబాద్ లో రోజురోజుకూ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం కలవరం [more]

Update: 2020-06-08 02:47 GMT

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. ప్రధానంగా హైదరాబాద్ లో రోజురోజుకూ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం కలవరం రేపుతోంది. ఒక్కరోజే పథ్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా తెలంగాణలో కరోనా వైరస్ 154 మందికి సోకింది. ఇందులో హైదరాబాద్ పరిధిలోనే 132 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ3,650 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 137 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం కరోనా వైరస్ సోకి ఆసుపత్రిలో 1,771 మంది చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News