సోమిరెడ్డి న్యూ ప్రపోజల్

పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును జగన్ పూర్తి చేయలేరని, మోదీ పూర్తి చేయాలని ఆయన [more]

Update: 2019-08-24 06:09 GMT

పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును జగన్ పూర్తి చేయలేరని, మోదీ పూర్తి చేయాలని ఆయన కోరారు. చంద్రబాబు మీద కోపంతో పోలవరం, అమరావతి నిర్మాణాలను జగన్ నిలిపేశారన్నారు. జగన్ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. దీనివల్ల వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఇప్పటికే అన్నా క్యాంటీన్లను మూసివేశారన్నారు. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపునకు చూసేందుకు భయపడుతున్నారన్నారు. గతంలో జగన్ కేంద్ర ప్రభుత్వమే పోలవరం నిర్మాణం చేపట్టాలని సూచించిన విషయాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తు చేశారు.

Tags:    

Similar News