బ్రేకింగ్: అదే బావిలో మరో బాలిక మృతదేహం

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపూర్ లో మరో దారుణం చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం ఈ గ్రామంలోని ఓ పాడుబడ్డ బావిలో ఇంటర్ విద్యార్థిని [more]

Update: 2019-04-29 10:27 GMT

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపూర్ లో మరో దారుణం చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం ఈ గ్రామంలోని ఓ పాడుబడ్డ బావిలో ఇంటర్ విద్యార్థిని శ్రావణి మృతదేహం దొరికిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు విచారిస్తుండగా ఇదే బావిలో మరో బాలిన మృతదేహం కూడా లభ్యం కావడం సంచలనం సృష్టిస్తోంది. మృతదేహం డిగ్రీ చదువుతున్న మనీషాదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నెల రోజుల క్రితం ఆమె తప్పిపోయినట్లు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. శ్రావణిని అత్యాచారం, హత్య చేసిన పాతిపెట్టిన బావిలో అంతకుముందే మనీషాను సైతం హత్య చేసి పాతిపెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసులో గ్రామానికే చెందిన ఓ పాత నేరస్థుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Tags:    

Similar News