మంత్రి సోమిరెడ్డికి ఝలక్

ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయన సొంత బావ రామకోట సుబ్బారెడ్డి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కుమారులు శశిధర్ రెడ్డి, [more]

Update: 2019-01-23 08:17 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయన సొంత బావ రామకోట సుబ్బారెడ్డి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కుమారులు శశిధర్ రెడ్డి, కళాధర్ రెడ్డితో కలిసి వారు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేరారు. వైసీపీ సీనియర్ నేతలు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు నెల్లూరు జిల్లా నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆయన లోటస్ పాండ్ లో వైసీపీలో చేరారు. వైసీపీని తీవ్రస్థాయిలో విమర్శించే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సొంత బావనే వైసీపీలో చేరడంతో ఆయనకు షాక్ తగిలినట్లయింది.

Tags:    

Similar News