చంద్రబాబుకు షాక్… స్టే రద్దు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన తెచ్చుకున్న స్టే రద్దయ్యింది. దీంతో ఈ కేసులో హైదరాబాద్ ఏసీబీ కోర్టు [more]

Update: 2019-04-26 07:07 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన తెచ్చుకున్న స్టే రద్దయ్యింది. దీంతో ఈ కేసులో హైదరాబాద్ ఏసీబీ కోర్టు విచారణ ప్రారంభించింది. చంద్రబాబుకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని 2005లో లక్ష్మీపార్వతి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అయితే, ఈ కేసు విచారణ జరగకుండా చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. కాగా, దీర్ఘకాలికంగా ఉన్న స్టేలను రద్దు చేయాలని ఇటీవల సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో చంద్రబాబు తెచ్చుకున్న స్టే రద్దయ్యింది. ఏసీబీ కోర్టు చంద్రబాబుపై ఉన్న కేసు విచారణను తిరిగి ప్రారంభించింది. ఈ కేసులో తమ ముందు విచారణకు హాజరుకావాల్సిందిగా పిటీషన్ వేసిన లక్ష్మీపార్వతికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇవాళ లక్ష్మీపార్వతి కోర్టు ముందు హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 13కు వాయిదా వేసింది.

Tags:    

Similar News