చంద్రబాబుకు ఆ అర్హత లేదు

తెలుగుదేశం పార్టీ నేతలకు తమను విమర్శించే ఎటువంటి నైతిక హక్కు లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరిగినా పట్టించుకోలేదన్నారు. [more]

Update: 2021-08-25 13:22 GMT

తెలుగుదేశం పార్టీ నేతలకు తమను విమర్శించే ఎటువంటి నైతిక హక్కు లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరిగినా పట్టించుకోలేదన్నారు. దళితులు, మహిళలపై దాడులు జరిగినా లోకేష్, చంద్రబాబు చూస్తూ ఉండిపోయారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దిశ చట్టాన్ని తెచ్చిన విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. తాను అధికారంలో ఉండగా ఏనాడు పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు మాత్రం అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. జాతీయ ఎస్సీీ కమిషన్ సయితం రమ్య హత్య విషయంలో ప్రభుత్వాన్ని ప్రశంసించిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Tags:    

Similar News