చంద్రబాబు అంత కుట్రదారు మరొకరుండరు

ఏ ఎన్నికల్లోనైనా చంద్రబాబు ఏదో ఒక సాకు వెతుక్కుంటారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నా దొంగ ఓట్లు అంటూ [more]

Update: 2021-04-18 01:14 GMT

ఏ ఎన్నికల్లోనైనా చంద్రబాబు ఏదో ఒక సాకు వెతుక్కుంటారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నా దొంగ ఓట్లు అంటూ గగ్గోలు పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తిరుపతికి వచ్చే టూరిస్ట్ లను కూడా చంద్రబాబు దొంగ ఓటర్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్నికలను అడ్డుకునేందుకు జరిగే కుట్రలో భాగమే ఇది అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ వెంట ప్రజలు ఉన్నారని, తాము దొంగ ఓట్లు వేయించాల్సిన ఖర్మ పట్టలేదని ఆయన తెలిపారు.

Tags:    

Similar News