కేసీఆర్ కిరికిరి అందుకే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేని వివాదాన్ని సృష్టిస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గతంలోనే తాము ఏపీ తెచ్చిన జీవోపై ఫిర్యాదు చేస్తే [more]

Update: 2021-07-04 13:12 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేని వివాదాన్ని సృష్టిస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గతంలోనే తాము ఏపీ తెచ్చిన జీవోపై ఫిర్యాదు చేస్తే కేసీఆర్ స్పందించలేదన్నారు. జగన్ కేసీఆర్ అనుమతితోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల్లో 64 శాతం ఏపీ, 34 శాతం తెలంగాణ వాడుకుంటామని సంతకాలు చేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ ఇప్పుడు 50 శాతం వాడుకుంటామని కిరికిరి పెడుతున్నారన్నారు. కేఆర్ఎంబీ సమావేశాన్ని కేసీఆర్ ఎందుకు వాయిదా వేయమన్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా కేసీఆర్ కుట్ర అని అన్నారు. కృష్ణా జలాల కోసం కేసీఆర్, కేటీఆర్ లు జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేయాలన్నారు.

Tags:    

Similar News