అక్కడ కేసీఆర్ కుటుంబ సభ్యులకు కూడా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దేవరయాంజల్ ఆలయ భూముల్లో కేసీఆర్ కుటుంబం, సన్నిహితుల భూములు ఉన్నాయని [more]

Update: 2021-05-04 01:22 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దేవరయాంజల్ ఆలయ భూముల్లో కేసీఆర్ కుటుంబం, సన్నిహితుల భూములు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 437 సర్వే నెంబరు లో మంత్రి కేటీఆర్ తో పాటు ఒక పత్రిక ఎండీ దామోదర్ రావుకు భూములున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి సంబంధించిన సేల్ డీడ్ కాపీలను రేవంత్ రెడ్డి బయటపెట్టారు. దేవరయాంజల్ భూముల వివరాలను బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని రేవంత్ రెడ్డి కోరారు.

Tags:    

Similar News