ఏపీలో రీపోలింగ్ ఐదు చోట్ల….??

ఆంధ్రప్రదేశ్ లో ఐదు చోట్ల రీపోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది వెల్లడించారు. జిల్లా [more]

Update: 2019-04-17 01:48 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఐదు చోట్ల రీపోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది వెల్లడించారు. జిల్లా రిటర్నింగ్ అధికారుల నుంచి వచ్చిన నివేదికల మేరకు ఐదు చోట్ల రీపోలింగ్ జరిగే అవకాశముందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావాల్సి ఉందన్నారు. ప్రకాశం జిల్లాలో ఒకటి, గుంటూరు జిల్లాలో రెండు, నెల్లూరు జిల్లాలో రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు సీఈసీకి సిఫార్సు చేసినట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నివేదిక అందిన వెంటనే రీపోలింగ్ తేదీలను ప్రకటించే అవాశముంది.

Tags:    

Similar News