కమ్మవారు తలచుకుంటే?

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ కమ్మ కులానికి చెందిన వారిని టార్గెట్ చేస్తున్నారని రాయపాటి ఆరోపించారు. కమ్మ [more]

Update: 2020-04-15 14:20 GMT

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ కమ్మ కులానికి చెందిన వారిని టార్గెట్ చేస్తున్నారని రాయపాటి ఆరోపించారు. కమ్మ వారు తలచుకుంటే ఏదైనా చేయగలరన్నారు. ప్రతి విషయంలో కమ్మ సామాజికవర్గానికి తీసుకురావడం జగన్ కు అలవాటుగా మారిందన్నారు. రెడ్డి సామాజికవర్గానికే ఎక్కువగా పోస్టింగ్ లు ఇస్తున్నారని రాయపాటి ఆరోపించారు. రాజధాని మార్పు విషయంలో తాను త్వరలో ప్రధానితో మాట్లాడతానని రాయపాటి చెప్పారు. కరోనా కల్లోలం ఆగిన తర్వాత తాను ప్రధానిని కలుస్తానని రాయపాటి సాంబశివరావు చెప్పారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ను తొలగించడం అన్యాయమని రాయపాటి అభిప్రాయపడ్డారు. ఎన్నికలు వాయిదా పడకపోతే వేల మంది కరోనా బారిన పడి చనిపోయేవారని రాయపాటి అన్నారు.

Tags:    

Similar News